హైదరాబాద్ : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కూతురిపై కన్నేశాడు. ఆమెను బాధ్యతగా పెంచి, భరోసా ఇవ్వాల్సినే నాన్నే.. బిడ్డ జీవితాన్ని నాశనం చేశాడు. భార్యను కోల్పోయిన అతను.. కుమార్తెపైనే అత్యాచారం చేశాడు. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. షాద్నగర్లో నివాసముంటున్న ఓ 40 ఏండ్ల వ్యక్తి కన్స్ట్రక్షన్ వర్కర్గా పని చేస్తున్నాడు. ఆ వ్యక్తి భార్య మూడేండ్ల క్రితం చనిపోయింది. ఆ వ్యక్తికి ఒక కూతురు కూడా ఉంది. ఆమె పదో తరగతి చదువుతోంది. అయితే మద్యానికి బానిసైన ఆయన.. కూతురిపై కన్నేశాడు. కామంతో చెలరేగిపోయాడు. ప్రతి రోజు కూతురిపై అత్యాచారం చేస్తూ, తన కోరికలను తీర్చుకుంటున్నాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడు. దిక్కుతోచని స్థితిలో ఆమె నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది.
అయితే గురువారం పాఠశాలకు వెళ్లిన బాలికకు తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో అప్రమత్తమైన టీచర్లు, ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా, గర్భిణి అని తేలింది. టీచర్లు షాక్కు గురై పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.