జైపూర్ : వాట్సాప్ మెసేజ్లతో లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ చేసిన మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్పై విద్యార్దిని పట్టువదలకుండా చేసిన పోరాటం కీచక ప్రొఫెసర్ అరెస్ట్కు దారితీసింది. ఏప్రిల్ 26న ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్ధిని భిల్వారాలోని సుభాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ప్రొఫెసర్ శంకర్ మోహన్ పన్వర్పై ఫిర్యాదు చేసింది. మెడికల్ కాలేజ్లో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేసే పన్వర్ వాట్సాప్ మెసేజ్ల ద్వారా నిత్యం వేధించేవాడని విద్యార్ధిని ఆరోపించింది.
పన్వర్ తన ప్రాక్టికల్ పరీక్ష మార్క్ షీట్లో కరెక్షన్ చేసి తనను ఫెయిల్ చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. తాను పరీక్ష రాస్తుండగా తన ఫోటోలు తీశాడని ఆరోపించింది. సుభాష్ నగర్ పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు. మరోవైపు విద్యార్ధిని ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు భిల్వారా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఏర్పాటు చేసిన కమిటీ సైతం పన్వర్ను దోషిగా తేల్చింది. ఆపై రాజస్ధాన్ ప్రభుత్వం పన్వర్ను భిల్వారా నుంచి బదిలీ చేసి భరత్పూర్కు బదిలీ చేసింది. విద్యార్ధిని ఫిర్యాదుపై పోలీసులు ప్రొఫెసర్ పన్వర్ను అరెస్ట్ చేశారు.