ముంబై: పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరైన ఒక అభ్యర్థి హైటెక్ చీటింగ్కు పాల్పడ్డాడు. అతడు ధరించిన మాస్క్లో సిమ్కార్డు, మైక్ అమర్చి ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. పింప్రి-చించ్వాడ్ పరిధిలోని హింజేవాడి ప్రాంతంలో ఉన్న బ్లూ రిడ్జ్ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష జరిగింది.
ఈ పరీక్షకు హాజరైన ఒక అభ్యర్థిని పోలీస్ నాయక్ శశికాంత్ దేవకాంత్ తనిఖీ చేశారు. అతడు ధరించిన మాస్క్లో ఎలక్ట్రానిక్ పరికరం ఉన్నట్లు గుర్తించారు. ఆ మాస్క్కి జేబీఎస్ బ్యాటరీ, ఛార్జింగ్ పాయింట్, ఎయిర్టెల్ సిమ్ కార్డ్, ఒక స్విచ్తోపాటు మైక్ కూడా అమర్చి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అవన్నీ కూడా వైర్లతో కనెక్ట్ అయ్యి ఉన్నాయి.
కాగా, పోలీసు ఈ మాస్క్ను పరిశీలిస్తుండగా ఆ అభ్యర్థి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.