పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్ వివరాల ప్రకారం జయరాజ్, శ్వేత దంపతులు గత రెండు నెలల క్రితం మైలార్దేవ్పల్లి నుంచి శ్రీరామకాలనీకి వచ్చి నివాసముంటున్నారు. ఈ నెల 15న రాత్రి భోజనం చేసిన తర్వాత వారు ఎప్పటిలాగానే నిద్రపోయారు.
ఉదయం 5 గంటలకు భర్త లేచి చూడగా భార్య కనిపించలేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైంది. పలు చోట్ల వెతికినా ఆమె ఆచూకి లభించలేదు. ఆమె భర్త జయరాజ్ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.