చెన్నై : వివాహిత(25) హత్య కేసులో ఆమె భర్త కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ గొంతుపై పెనుగులాడిన గుర్తులు ఉండటంతో భర్తే ఘాతుకానికి తెగబడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహిత మృతదేహం మింజూర్ వద్ద ఓ గుడి సమీపంలో శనివారం రాత్రి లభ్యమైంది. స్ధానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు.
మహిళపై ఆభరణాలు అలాగే ఉండటం, హత్య తర్వాత భర్త కనిపించకుండా పోవడంతో పోలీసులు ఆయనను అనుమానిస్తున్నారు. బాధితురాలు మీనా చెన్నైకి చెందిన ముతరాసన్ను కొన్నేండ్ల కిందట పెండ్లి చేసుకుంది. మీనా ప్రవర్తనపై ముతరాసన్ అనుమానం పెంచుకోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని స్ధానికులు చెబుతున్నారు. పనిచేసే ప్రదేశంలో మీనా ఇతర వ్యక్తులతో చనువుగా ఉండటం ముతరాసన్లో అనుమానం బలపడేలా చేసింది. వారిద్దరూ మీనా హత్య జరిగిన ప్రాంతంలోనే చివరిసారి కనిపించారని స్ధానికులు తెలిపారు.