జోగులాంబ గద్వాల : జిల్లాలోని మానోపాడు తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రికార్డ్ రూమ్ పూర్తిగా కాలిపోయింది. పలు రికార్డులు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చారు. సంఘటనా స్థలాన్ని ఆర్డీవో పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.