న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ ఢిల్లీలో మణిపూర్ మహిళను కొందరు లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు శుక్రవారం రాత్రి సఫ్దర్జంగ్ ఆస్పత్రి నుంచి నెబ్సరైకి వస్తుండగా బైక్లపై వచ్చిన దుండగులు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ లైంగిక వేధింపులకు గురిచేశారు.
షాపు దగ్గర ఆగిన మహిళను చుట్టుముట్టిన బైకర్లు బాధితురాలితో అభ్యంతరకరంగా వ్యవహరించారు. వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.