Delhi | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి షాబాద్ డెయిరీ ఏరియాలో 16 ఏండ్ల బాలికను ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సాహిల్ను ఉత్తరప్రదేశ్లోని బులంద్షార్లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఫ్రిడ్జ్, ఏసీ రిపేరింగ్ మెకానిక్గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలిక హత్య కేసులో నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ నుమన్ నవ్లా స్పష్టం చేశారు.
అయితే బాలిక తన ఫ్రెండ్ కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా వారింటికి వెళ్తుండగా.. మధ్యలో సాహిల్ అడ్డుకున్నాడు. బర్త్ డే పార్టీ విషయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన సాహిల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో బాలికపై విచక్షణారహితంగా దాడి చేశారు. 21 సార్లు పొడిచి చంపాడు. ఆమె పుర్రెలో కత్తి ఇరుక్కుపోయింది. ఆ తర్వాత ఆమె తలపై బండరాయితో మోదాడు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయాడు.
అయితే షాబాద్ డెయిరీ ఏరియాలో బాలికను అడ్డగించి కత్తి దాడి చేసింది పట్టపగలే. అందరూ చూస్తుండగానే బాలికపై కత్తితో దాడి చేశాడు. కానీ అతన్ని ఆపేందుకు ఎవరూ సాహసం చేయలేదు. స్థానికులు తమ దారిన తాము వెళ్లిపోయారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు కావడంతో.. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులకు సులువైంది.
#WATCH | We have arrested the accused, Sahil from Bulandshahr, Uttar Pradesh. He used to work as a mechanic for AC and Refrigerators. Further investigation is underway, We will make sure that the maximum punishment is given to the accused: Suman Nalwa, Deputy Commissioner of… pic.twitter.com/U2DQ83m1TD
— ANI (@ANI) May 29, 2023