లక్నో : పిల్లలు పటాకులు కాల్చే వ్యవహారంలో ఘర్షణతో రెచ్చిపోయిన ఓ వ్యక్తి ఇద్దరు మహిళలపై యాసిడ్ పోసిన ఘటన యూపీలోని బందా జిల్లా కైలాష్పురి ప్రాంతంలో వెలుగుచూసింది. పండ్లు విక్రయించే వ్యక్తి తమ కాలనీలో ఆడుకుంటూ పటాకులు కాలుస్తున్న పిల్లలను వారించాడు.
పిల్లలు వినకపోవడంతో వారిపై చేయిచేసుకున్నాడు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆగ్రహంతో ఊగిపోయిన వ్యక్తి తన ఇంట్లో ఉన్న యాసిడ్ బాటిల్ తీసుకువచ్చి ఇద్దరు మహిళలపై దాన్ని పోశాడు. తీవ్రగాయాలైన బాధితులను స్ధానికులు దవాఖానకు తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన అనంతరం పరారీలో ఉన్న నిందితుడని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు.