పుణే : మహారాష్ట్రలోని పుణేలో దారుణం జరిగింది. తనను దూరం పెడుతోందనే ఆగ్రహంతో మాజీ ప్రియురాలిని ఓ వ్యక్తి కడతేర్చిన ఉదంతం పుణేలో కలకలం రేపింది. బాధితురాలు సునీతా సూర్యవంశీ (39)తో నిందితుడు, బిహార్కు చెందిన గులాం షేక్ (42)కు వివాహేతర సంబంధం ఉంది. సునీతా ఇంట్లో అద్దెకు ఉండే గులాం షేక్ క్రమంగా ఆమెకు దగ్గరయ్యాడు.
గ్రామం నుంచి తిరిగివచ్చిన నిందితుడు మహిళతో ఘర్షణకు దిగడంతో ఫిబ్రవరి 6న ఈ ఘటన వెలుగుచూసింది. కొవిడ్ లాక్డౌన్తో గ్రామానికి వెళ్లిన నిందితుడు తిరిగివచ్చిన తర్వాత అతడితో సంబంధానికి మహిళ నిరాకరించి దూరం పెట్టింది. తమ విషయం కుటుంబసభ్యులకు తెలిసి మందలించడంతో మహిళ నిందితుడితో మాట్లాడటం మానేసింది.
ఇదే విషయమై నిందితుడు మహిళను నిలదీయండంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. నిందితుడు కోపంతో మహిళను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. బాధితురాలి భర్త రఘునాధ్ సూర్యవంశీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు బిహార్ చేరుకున్నారని త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని పోలీస్ ఇన్స్పెక్టర్ భరత్ జాదవ్ పేర్కొన్నారు.