భోపాల్: టోల్ రుసుం చెల్లించాలని అడిగిన టోల్ బూత్ మహిళా ఉద్యోగిని ఒక వ్యక్తి చెంపపై కొట్టాడు. దీంతో ఆమె కూడా ఎదురు తిరిగి అతడ్ని చెప్పుతో కొట్టింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాజ్గఢ్-భోపాల్ రహదారిలోని కచ్నారియా టోల్ ప్లాజాకు రాజ్ కుమార్ గుర్జార్ అనే వ్యక్తి కారులో వచ్చాడు. అయితే అతడి వాహనానికి ఫాస్టాగ్ లేదు. దీంతో టోల్ ట్యాక్స్ కట్టాలని అక్కడి మహిళా ఉద్యోగిని అనురంద డాంగి అడిగింది. అయితే తాను స్థానికుడినని, టోల్ రుసుం చెల్లింపు నుంచి మినహాయింపు ఉందని వాదించాడు. దీంతో ఆయన గురించి తనకు తెలియదన్న ఆమె సంబంధిత పత్రాలు చూపమని అడిగింది.
కాగా, తన కారును అక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో రాజ్ కుమార్ ఆగ్రహం చెందాడు. వెంటనే కారు దిగి వచ్చి మహిళా ఉద్యోగిని చెంపపై కొట్టాడు. అయితే ఆమె కూడా ఎదురు తిరిగింది. తన కాలి చెప్పుతో అత్నడి కొట్టింది. దీంతో అతడు మరింతగా రెచ్చిపోయి ఆమెపై దాడి చేశాడు. ఇంతలో స్థానికులు అతడ్ని అడ్డుకుని నివారించారు.
మరోవైపు మహిళా ఉద్యోగిని అనురంద ఫిర్యాదుతో పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆ టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A man slapped a woman employee of a toll both in Rajgarh after she refused to let him go without paying the tax. The man is seen angrily walking towards the employee and then slapping her across the face, The woman hits him back with her footwear @ndtv @ndtvindia pic.twitter.com/hmK0ghdImX
— Anurag Dwary (@Anurag_Dwary) August 21, 2022