మనకు ఎవరైనా చిరిగిన నోటు ఇస్తే ఏం చేస్తాం? వేరే నోటివ్వు అంటూ గొడవపడతాం. అలా అడగటమే ఒక డెలివరీ బాయ్ ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన యూపీలోని షాజహాన్పూర్లో జరిగింది. సచిన్ కశ్యప్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఒక పిజ్జా షాపులో పనిచేస్తున్నాడు. మరో అరగంటలో షాపు మూసేస్తారనగా.. రాత్రి 11 గంటలకు నదీమ్ ఖాన్, నయీమ్ ఖాన్ అనే ఇద్దరు సోదరులు పిజ్జా ఆర్డర్ చేశారు.
ఈ ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి రితిక్ కుమార్ అనే కొలీగ్తో కలిసి సచిన్ వెళ్లాడు. పిజ్జా ఇచ్చేసి డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక సాపుకు వెళ్లి కూల్డ్రింక్ తీసుకున్నాడు. అయితే ఆ నోటు చిరిగి ఉండటంతో.. దాన్ని తీసుకోవడానికి షాపు యజమాని నిరాకరించాడు. దాంతో మళ్లీ తను డెలివరీ ఇచ్చిన ఇంటికి వచ్చిన సచిన్.. తనకు వేరే నోటివ్వాలని అడిగాడు.
అలా అడగడంతో కోపం తెచ్చుకున్న నదీమ్.. ఇంట్లో ఉన్న నాటు తుపాకీ తీసుకొచ్చి సచిన్ను కాల్చిపారేశాడు. ఈ చప్పుడు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు నదీమ్, నయీమ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి ఇంటి నుంచి రెండు నాటు తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సచిన్ పరిస్థితి విషమంగా ఉందని, నదీమ్ సోదరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని అధికారులు వెల్లడించారు.
थाना सदर बाजार #shahjahanpurpol ने की त्वरित कार्यवाही,
पिज्जा डिलीवरी ब्यॉय को गोली मारने वाले दोनों अभियुक्तों को किया गिरफ्तार, एक अवैध तमंचा 12 बोर मय कारतूस व घटना मे प्रयुक्त अवैध तमंचा 32 बोर मय जिन्दा/खोखा कारतूस बरामद ।#uppolice https://t.co/4q4U0PUQjx pic.twitter.com/YvegVTBIEp— SHAHJAHANPUR POLICE (@shahjahanpurpol) August 26, 2022