ముంబై : కరోనా మహమ్మారి కట్టడికి కఠిన నియంత్రణలు అమలవుతున్నా డ్రగ్స్ సరఫరాదారులు అక్రమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. ముంబై పోలీసులు బుధవారం రూ 28 లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని అంధేరి శివార్లలో అరెస్ట్ చేశారు.
నిందితుడి నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తో కూడిన బ్యాగ్ ను కలిగిఉన్న నిందితుడు ఆ ప్రాంతంలో మాటు వేసి వేరొకరి కోసం వేచిచూస్తుండగా సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుడిని సచిన్ మాన్ సింగ్ కదమ్ గా పోలీసులు గుర్తించారు.