న్యూఢిల్లీ : గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్ల కేసులు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వం, పోలీసులు సైబర్ నేరాల పట్ల ప్రజల్లో ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఆన్లైన్ అడ్డాగా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతున్నారు. అమాయకుల నుంచి స్కామర్లు అందినకాడికి దండుకుంటున్నారు. తొలుత కొద్ది మొత్తాలను రిటన్స్గా చూపి బాధితుల నమ్మకాన్ని చూరగొంటున్న స్కామర్లు ఆపై భారీ స్కెచ్తో నిలువు దోపిడీ చేస్తున్నారు.
లేటెస్ట్గా థానేకు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో జాబ్ల కోసం వెతుకుతుండగా అతడిని సంప్రదించిన స్కామర్లు ఏకంగా రూ. 37 లక్షలు కొట్టేశారు. పార్ట్టైం జాబ్తో రోజుకు రూ. 2000 నుంచి రూ. 3000 వరకూ సంపాదించవచ్చని నమ్మబలికిన నిందితులు బాధితుడి నుంచి పెద్దమొత్తంలో లూటీ చేశారు. వాట్సాప్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాగా బాధితుడు స్పందించాడు. రోజుకు రూ. 3000 వరకూ సంపాదించవచ్చని మభ్యపెట్టిన స్కామర్ బాధితుడికి పార్ట్టైం జాబ్ ఆఫర్ చేశాడు.
\ఇన్స్టాగ్రాంలో సెలబ్రిటీల ఫొటోలకు లైక్ చేస్తే చాలని పెద్దమొత్తంలో ఆర్జించవచ్చని నమ్మబలికాడు. లైక్ చేసిన స్క్రీన్షాట్ పంపితే ఒక్కో లైక్కు రూ. 70 చెల్లిస్తామని నమ్మబలికాడు. తొలుత చిన్న మొత్తంలో డబ్బు చెల్లించిన స్కామర్ బాధితుడి నమ్మకాన్ని చూరగొన్నాడు. ఆపై అతడిని టెలిగ్రాం గ్రూప్లో జాయిన్ చేసి టాస్క్లు ఇచ్చారు.
కొన్ని టాస్క్లకు రిటన్స్ ఇవ్వడంతో పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని స్కామర్లు చెప్పిన మాటలు నమ్మి పెద్దమొత్తంలో రిటన్స్ వస్తాయని భావించిన బాధితుడు రూ. 37 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఆపై ఒక్క రూపాయి కూడా స్కామర్లు తిరిగిఇవ్వకపోగా మరికొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తే గతంలో పెట్టిన డబ్బులతో పాటు ఆకర్షణీయ రిటన్స్ వస్తాయని స్కామర్లు చెప్పడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read More :