న్యూఢిల్లీ : సైబర్ నేరాలపై పోలీసులు, ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన పెంచుతున్నా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతూనే ఉన్నారు. అమాయకుల బ్యాంకు ఖాతాల నుంచి రెప్పపాటులో పెద్దమొత్తంలో సొమ్ము స్వాహా చేస్తున్నారు. ఇదే తరహా ఘటనలో టిండర్ స్కామ్లో ఓ వ్యక్తి నుంచి భాగస్వామి ఏకంగా రూ. 14 కోట్ల కొట్టేయడం కలకలం రేపింది.
డిజిటల్ మనీలో పెట్టుబడులు పెడితే పెద్దమొత్తంలో రిటన్స్ వస్తాయని టిండర్ లవర్ నమ్మబలకడంతో పెట్టుబడులు పెట్టిన బాధితుడు ఆపై సర్వం కోల్పోయాడు. ఇటలీకి చెందిన 55 ఏండ్ల బాధితుడు హాంకాంగ్లో నివసిస్తున్నాడు. టిండర్లో పరిచయమైన వ్యక్తితో అనుబంధం పెంచుకున్నాడు. వారు ఆపై వాట్సాప్లోనూ టచ్లో ఉన్నారు.
సింగపూర్లో తాను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేస్తున్నట్టు టిండర్ లవర్ బాధితుడిని నమ్మబలికారు. ఈ క్రమంలో బాధితుడిచే డిజిటల్ మనీలో రూ. 14 కోట్లు పెట్టుబడులు పెట్టించారు. మార్చి 6 నుంచి మార్చి 23 మధ్య 22 లావాదేవీలు జరగ్గా మొత్తం 9 బ్యాంకు ఖాతాల్లో బాధితుడు డబ్బు డిపాజిట్ చేశాడు. ఆపై తన సొమ్ము ఎంతకీ వెనక్కిరాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read More