భోపాల్ : కులాంతర వివాహం చేసుకున్న ఓ కూతురి పట్ల తండ్రి రాక్షసంగా ప్రవర్తించాడు. అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అంతమొందించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే రితాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ యువతి గతేడాది కులాంతర వివాహం చేసుకున్నది. ఈ వివాహం తండ్రికి ఇష్టం లేదు. ఇదే సమయంలో ఆ కుటుంబాన్ని తమ కులం నుంచి సాంఘిక బహిష్కరణ చేశారు. దీంతో ఆమె తండ్రి తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. అయితే దీపావళి పండుగకు ఆమె తన సోదరి నివాసానికి వచ్చింది. తన ఎనిమిది నెలల బాబు అనారోగ్యానికి గురై మరణించాడు. ఈ విషయాన్ని బాధితురాలి సోదరి తన తండ్రికి తెలిపింది.
ఎనిమిది నెలల బాబుకు అంత్యక్రియలను చెద్దామని చెప్పి, కూతురిని తండ్రి అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి మట్టుబెట్టాడు. బాబు, తల్లి అదృశ్యంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల క్రితం తల్లీబిడ్డల మృతదేహాలను షీహోర్ జిల్లా అడవుల్లో పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తండ్రిని అరెస్టు చేసి విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. రెండు వారాల క్రితం కూతురిని హత్యాచారం చేసినట్లు తండ్రి పేర్కొన్నాడు.