చెన్నై : కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తండ్రి తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో వెలుగు చూసింది.
లక్ష్మణ్ అనే వ్యక్తికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. జీవనోపాధి కోసం టీ షాపు నిర్వహిస్తున్నాడు లక్ష్మణ్. అయితే ఈయన పెద్ద కుమార్తె ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి.. తన భార్య, ఇద్దరు పిల్లలను చంపేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
లవ్ మ్యారేజ్ చేసుకున్న పెద్ద కుమార్తె తన భర్తతో వేరే ప్రాంతంలో నివసిస్తోంది. విషయం తెలుసుకున్న కుమార్తె బోరున విలపించింది. ఈ హత్య, ఆత్మహత్య ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.