Dulapally : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి దూలపల్లిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని శ్రీకాంత్ గౌడ్గా గుర్తించారు పోలీసులు. ఈ దాడిలో అతడి స్నేహితుడు అలీ గాయపడ్డాడు గుర్తించారు పోలీసులు. షెడ్లో మద్యం తాగుతున్న శ్రీకాంత్, అలీపై ఒక బ్యాచ్ ఒక్కసారిగా దాడి చేసింది.
శ్రీకాంత్ను బీర్ బాటిల్స్తో కొట్టి పొడిచి.. చంపేశారు. అలీకి తీవ్ర గాయాలు కావడంతో అతడిని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్పై దాడి, హత్యకు భూ వివాదాలు, పాత కక్షలే కారణం అని స్థానికులు అనుకుంటున్నారు. అయితే.. పూర్తి వివరాలు రావాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.