కరోనా ధాటికి బాలీవుడ్లోని అగ్ర హీరోలందరూ తమ సినిమాల విడుదలలను వాయిదావేసుకోగా.. సల్మాన్ఖాన్ మాత్రం వెనక్కి తగ్గ లేదు. కరోనా భయాలు నెలకొన్నప్పటికీ ముందుగా ప్రకటించినట్లుగానే మే 13వ తేదీన ‘రాధే’ సినిమాను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. థియేటర్తో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా అదే రోజు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.స్టార్ హీరో నటించిన సినిమా థియేటర్తో పాటు ఓటీటీలో ఒకేసారి విడుదలకాబోతుండటం ఇదే తొలిసారి కావడంతో ‘రాధే’ చిత్రబృందం ప్రకటన ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. వారి నిర్ణయం పట్ల పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు ఎలా స్పందిస్తారో వేచిచూడాలని ట్రేడ్వర్గాలు అంటున్నాయి. ఓటీటీలో పే ఫర్ వ్యూ విధానంలో ఈ సినిమాను విడుదలచేయబోతున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. దిశాపటా నీ కథానాయికగా నటిస్తోంది.