భోపాల్ : లైంగిక వేధింపులను ప్రతిఘటించిన మహిళను మధ్యప్రదేశ్లోని చతార్పూర్ జిల్లాలో కదులుతున్న రైలు నుంచి తోసివేసిన ఘటనలో నిందితుడి(26)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 27న జరిగిన ఈ ఘటనలో యూపీలోని బందా జిల్లాకు చెందిన మహిళ(22)కు గాయాలయ్యాయి.
ప్రస్తుతం బాధితురాలు దవాఖానలో చికిత్స పొందుతోంది. చత్తార్పూర్లోని భగేశ్వర్ ధామ్లో ఆలయాన్ని సందర్శించేందుకు మహిళ వెళుతుండగా సహ ప్రయాణీకుడు ఆమెను కదులుతున్న రైలులో వేధింపులకు గురిచేశాడు. నిందితుడి చర్యను ప్రతిఘటించిన ఆమె దూరంగా వెళ్లాలని కోరింది.
దీంతో కదులుతున్న రైలు నుంచి మహిళను నిందితుడు బయటకు తోసివేశాడు. మహిళను వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా ఆపై మెరుగైన చికిత్స కోసం గ్వాలియర్ తరలించామని జబల్పూర్ ఎస్హెచ్ఓ ఆకాంక్ష సింగ్ తెలిపారు.