భోపాల్: ఆసుపత్రిలో ఒక రోగిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మిలన్ రాజక్ అనే వ్యక్తి గురువారం బుందేల్ఖండ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో తిరిగాడు. లాబీలో ఉన్న రోగి దామోదర్ కోరిపై పెట్రోల్ పోసి లైటర్తో నిప్పుపెట్టాడు. దీంతో ఆ రోగికి మంటలు అంటుకున్నాయి. అయినప్పటికీ నిందితుడు మిలన్ను పట్టుకునేందుకు దామోదర్ ప్రయత్నించాడు. మంటలతోనే వెంబడించగా అతడు పారిపోయాడు. కాలిన గాయాలైన దామోదర్కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మిలన్ రాజక్ను గోపాల్గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.