బెంగళూర్ : గత ఏడాదిగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. స్కామర్లు రోజుకో తరహా స్కామ్తో చెలరేగుతున్నారు. లేటెస్ట్గా ఆన్లైన్ స్కామ్లో (Fake SMS Scam) బెంగళూర్కు చెందిన ఓ సేల్స్ ఎగ్జిక్యూటివ్ రూ. 38,000 నష్టపోయాడు. నగరానికి చెందిన చెన్నకేశవకు స్కామర్లు స్విగ్గీ మాటున మోసపూరిత ఎస్ఎంఎస్ పంపారు. రూ. 5435 విలువైన ఆర్డర్ పంపారని, ఆ లావాదేవీని చెక్ చేసుకోవాలని కోరారు.
ఆటోమొబైల్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసే చెన్నకేశవకు ఆపై స్విగ్గీ నుంచి మాట్లాడుతున్నామని కాల్ వచ్చింది. తన ఖాతాతో ఆర్డర్ వచ్చిందని నమ్మబలుకుతూ వాయిస్ ప్రాంప్ట్స్ను ఫాలో కావాలని కోరారు. ఈ క్రమంలో చెన్నకేశవ ఓటీపీలను వెల్లడించాడు. మోసపూరిత కాల్గా అనుమానించి స్విగ్గీ ఖాతా నుంచి అతడు లాగౌట్ కాగా, అప్పటికే తన లేజీ పే లోన్ అప్లికేషన్ అకౌంట్ నుంచి రూ. 38.720 డెబిట్ అయ్యాయి.
మోసపోయానని గుర్తించిన బాధితుడు స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్విగ్గీ అకౌంట్లో అతడి సమాచారం అంతటినీ సైబర్ నేరగాళ్లు తొలగించినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :