కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణం వెలుగుచూసింది. వాటర్ బాటిల్ కొనుగోలు విషయంలో దుకాణదారుతో జరిగిన వివాదం ఓ వ్యక్తి మరణానికి దారితీసిన ఘటన నగరంలోని గిరీష్ పార్క్ ప్రాంతంలో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి ఇద్దరు సోదరులు ఓ టీ స్టాల్కు వెళ్లగా మినరల్ వాటర్ బాటిల్ కొనుగోలు విషయంలో దుకాణదారుతో వాదన జరిగింది. ఆపై ఇద్దరు సోదరులు దుకాణదారుడిపై ఇనుప రాడ్తో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
కాగా, మృతుడిని లేక్టౌన్ ప్రాంతానికి చెందిన 20 ఏండ్ల ఆకాష్ ప్రతాప్ కూరిగా గుర్తించారు. ఆకాష్ సోదరుడు చందన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.
Read More :
Israel- Hamas War | హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ మలి విడత పోరు..రణక్షేత్రంగా మారిన గాజా