ప్రఖ్యాత మ్యూజియంలోకి అర్ధరాత్రి దూరిన ఆ యువకుడు.. మెయిన్ సెక్షన్లోకి వెళ్లి తన కంటికి కనిపించిన విలువైన వస్తువులు అన్నింటినీ నాశనం చేశాడు. ఈ ఘటన అమెరికాలోని డల్లాస్లో వెలుగు చూసింది. బ్రయాన్ హెర్నాండెజ్ అనే 21 ఏళ్ల యువకుడు.. తన గర్ల్ఫ్రెండ్తో గొడవపడ్డాడు. ఈ కోపంలో ఏం చేయాలో తెలియలేదు.
దాంతో దగ్గరలో ఉన్న ‘డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’లో చొరబడ్డాడు. మ్యూజియం అద్దాల తలుపులను ఒక కుర్చీతో పగలగొట్టి లోపలకు ప్రవేశించాడు. ఆ తర్వాత లోపల కనిపించిన ఒక స్టూల్ తీసుకొని.. 2500 సంవత్సరాల క్రితానికి చెందిన గ్రీక్ ఆర్టిఫ్యాక్టులను ధ్వంసం చేశాడు. అలాగే మరికొన్ని విలువైన వస్తువులను కూడా నాశనం చేశాడు. వీటి అంచనా విలువ సుమారుగా 51లక్షల డాలర్లపైగా ఉంటుందని మ్యూజియం నిర్వాహకులు చెప్తున్నారు.
ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడిన తర్వాత.. ఈ విలువ తగ్గుతుందని వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బ్రయాన్2ను అదుపులోకి తీసుకున్నారు. ప్రేయసితో గొడవ కారణంగా ఏదో ఒకటి నాశనం చేయాలన్న కసితోనే మ్యూజియంలో దూరానని బ్రయాన్ అంగీకరించాడు.