కాచిగూడ : తల్లి, భార్య మందలించారని మనస్థాపంతో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ బిజీ ప్రసాద్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన గ్యానోభా కుమారుడు చుంచు నర్సింలు (36) జోమాటో లో పనిచేసేవాడు.
గత కొన్ని రోజులుగా నర్సింలు పని చేయడంలేదు. దీంతో తల్లి, భార్య ఏం పనిచేయకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని మందలించడంతో మనస్థాపానికి గురయ్యాడు. అనంతరం గురువారం రాత్రి విద్యానగర్-జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.దీంతో ఆతని శారీర భాగాలు చెల్లాచెదురయ్యాయి.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసును కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.