తెలుగుయూనివర్సిటీ: గుర్తు తెలియని ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ పి. నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం…లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం సుమారు 55సంవత్సరాల వ్యక్తి ప్యాసింజర్ రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం అందిందన్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు పరిశీలించగా తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు.
ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించి శవపంచనామా నిర్వహించి ఉస్మానియా దవఖాన మార్చురీలో మృతదేహన్ని భద్రపరిచి కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుని శరీరంపై నలుపు గీతల తెలుపు రంగు పుల్షర్టు, యాష్ కలర్ నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడని సంబంధీకులు 9000394635నెంబర్లో సంప్రదించాలని సూచించారు.