లక్నో: పొరుగింటి వ్యక్తితో కలిసి భార్య పారిపోయింది. దీంతో మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర ప్రదేశ్లోని గురుగ్రామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కసన్ గ్రామంలో నివాసం ఉంటున్న కవిందర్ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేయడంతోపాటు క్యాబ్ నడుపుతున్నాడు. ఈ నెల 10న అతడి భార్య రీనా పొరుగింటి వ్యక్తి రామ్వీర్తో కలిసి వెళ్లిపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కవిందర్, తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న కవిందర్ను గమనించిన సోదరుడు సంతోష్ కుమార్, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే కవిందర్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కవిందర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం అనంతరం అతడి బంధువులకు అప్పగించారు. సోదరుడు సంతోష్ కుమార్ ఫిర్యాదు నేపథ్యంలో మృతుడి భార్య రీనాపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఆమెతోపాటు పొరుగింటి వ్యక్తి రామ్వీర్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వారిద్దరిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.