అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 93 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. చిత్తూర్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో బుధవారం నాటికి కరోనా కేసులు సంఖ్య 8,91,004కు చేరింది. 8,82,763 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 1064 యాక్టివ్ కేసులున్నాయి. 7,177 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 48,973 శ్యాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 1,43,56,138 పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.