ముంబై : తన నుంచి దూరమైన భార్య నగ్న వీడియోను వాట్సాప్లో అప్లోడ్ చేసిన వ్యక్తి (30)పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి(28) ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. తన భర్త, అత్తింటి వారు తనను శారీరకంగా, మానసికంగా హింసించారని ఫిర్యాదులో మహిళ పేర్కొన్నారు. అత్తింట వేధింపులు భరించలేక బాధిత మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి థానేలోని మెట్టినింటి నుంచి మలద్లోని పుట్టింటికి వచ్చేసింది.
తమకు ఫ్లాట్ రాసివ్వాలని భర్తతో పాటు అత్తింటి వారు వేధిస్తున్నారని గత ఏడాది బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదుపై ఆమె భర్తను పోలీస్ స్టేషన్కు పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఫిర్యాదును వెనక్కితీసుకోవాలని భార్యను కోరగా ఆమె నిరాకరించడంతో నిందితుడు కోపం పెంచుకున్నాడని పోలీసులు చెప్పారు.
భార్యపై ఆగ్రహంతో ఆమె స్నానం చేస్తున్న వీడియోను వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు. బాధితురాలి సోదరి ఈ వీడియో క్లిప్ను చూసి సోదరికి తెలిపింది. బాధితురాలు కురార్ పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.