లక్నో: ఆహారం వండేందుకు భార్య నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన భర్త ఆమెను కొట్టి చంపాడు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. బీహార్కు చెందిన 35 ఏళ్ల అనుజ్ కుమార్, 30 ఏళ్ల ఖుష్బూ దంపతులు నోయిడా సెక్టార్ 66 ప్రాంతంలోని శ్రామిక్ కుంజ్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. అనుజ్ ఆటో నడుపుతున్నాడు. శనివారం పెద్ద పిల్లవాడు స్కూల్కు వెళ్లగా, చిన్న పిల్లవాడు బంధువుల ఇంటికి వెళ్లాడు. దీంతో ఆ దంపతులు ఇద్దరే ఇంట్లో ఉన్నారు. ఆటో నడిపేందుకు బయటకు వెళ్లడం కోసం అనుజ్ సిద్ధమయ్యాడు. తనకు భోజనం వండాలని భార్య ఖుష్బూకు చెప్పాడు. అయితే వంట చేసేందుకు ఆమె నిరాకరించింది.
దీంతో ఆగ్రహించిన అనుజ్ వంటగదిలోని ఫ్రై పాన్తో భార్య ఖుష్బూ తలపై పలుమార్లు కొట్టాడు. దీంతో తలకు రంధ్రం పడి రక్తం ధారగా కారడంతో ఆమె మరణించింది. గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లారు. భార్య మృతదేహం వద్ద ఉన్న భర్త అనుజ్ను అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్మార్టం కోసం ఖుష్బూ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. బీహార్లోని ఆ మహిళ కుటుంబానికి ఈ సమాచారం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.