అహ్మదాబాద్ : ప్రియురాలిపై మోజుతో అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లిన వ్యక్తిని మహిళ కుటుంబసభ్యులు చితకబాదిన ఘటన గుజరాత్లోని మోతి భయాన్ గ్రామంలో వెలుగుచూసింది. మహిళతో పట్టుబడ్డ వ్యక్తిని ఆమె భర్త, మరిది మరికొందరు తీవ్రంగా కొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళతో గత ఏడాదిగా సన్నిహితంగా మెలుగుతున్న వ్యక్తి తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడటంతో పాటు అప్పుడప్పుడూ కలుస్తుండేవాడు.
ఈ క్రమంలో తన భర్త వేరే ఊరు వెళ్లాడని తమ ఇంటికి రావాలని మహిళ కోరడంతో శనివారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికే మహిళ మరిది మరికొందరితో కలిసి వ్యక్తిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని కర్రలతో దాడి చేశారు. కొద్దిసేపటికే బంధువులతో కలిసి ఇంటికి చేరుకున్న భర్త బాధితుడిని తీవ్రంగా కొట్టాడు. మూకదాడితో వ్యక్తి చేయికి ఫ్రాక్చర్ అయింది. ఆపై పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని వ్యక్తిని కాపాడి చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.