హైదరాబాద్ : ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్నగర్కు చెందిన పిట్ల సంతోష్ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే శాఖలో ఉద్యోగం పేరుతో ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.3 లక్షలు వసూలు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సంతోష్ను అరెస్టు చేశారు. ఇతడిపై మహబూబ్నగర్, వరంగల్, సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యయి.