చెన్నై : తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. కోయంబత్తూర్లోని పెరుమనల్లూర్ ప్రాంతంలో ముగ్గురు బాలికలపై 52 ఏండ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఇద్దరు బాలికల వయసు ఐదు, ఏడేండ్లు కాగా మరో బాలిక వయసు పదేండ్లని పోలీసులు తెలిపారు.
నిందితుడి ఇంటికి సమీపంలో ముగ్గురు బాలికలు నివసిస్తున్నారు. గత నెలలో ముగ్గురు బాలికలు వీధిలో ఆడుకుంటుండగా నిందితుడు వారిని తన ఇంటికి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికలు తమ తల్లికి విషయం తెలపడంతో వారు మే 1న అవినషి ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆపై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.