నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో దారుణం జరిగింది. ఇప్పటికే హత్యచేసి జైలుకు వెళ్లిన వ్యక్తి ఇటీవల పెరోల్పై వచ్చి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నాసిక్లోని పవన్ నగర్కు చెందిన 27 ఏండ్ల మహిళ స్థానికంగా ఒక బ్యూటీ పార్లర్ నడుపుతున్నది. ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం కూడా బ్యూటీ పార్లర్లో దేవుడికి పూజ చేస్తుండగా నిందితుడు ఆ పార్లర్లోకి ప్రవేశించాడు.
కత్తి చూపించి బెదిరిస్తూ దగ్గరికి వచ్చిన నిందితుడు అమాంతం ఆమె మీదపడి రెండు చేతులు కట్టేశాడు. ఆపై నోట్లో వస్త్రం కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి జారుకున్నాడు. అయినా, బాధిత మహిళ ధైర్యం చేసి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.