హైదరాబాద్ : నగరంలోని ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి రేతిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో ఘటనాస్థలంలోనే వ్యక్తి మృతి చెందగా.. మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీని డ్రైవర్ అక్కడే వదిలి పరారయ్యేందుకు యత్నిస్తుండగా స్థానికులు పట్టుకొని చితకబాదారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.