కులకచర్ల : చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన సంఘటన డాపూర్ మండల పరిధిలోని కన్మన్కల్వ గ్రామంలో చోటు చేసుకుంది. కన్మన్కల్వ గ్రామానికి చెందిన కర్నె చిన్న అంజిలయ్య అనే రైతు తనకున్న పశువులను పొలం దగ్గర ఎప్పటిలాగా కట్టేసి శనివారం ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం పొలానికి వెళ్లీ చూడగ 35వేల విలువ చేసే లేగదూడ రక్తపు మడుగులో పడి ఉంది. లేగ దూడ మృతి చెందిన స్థలంలో చిరుత ఆనవాళ్లు కనిపించడంతో లేగదూడ చిరుతదాడిలో మృతి చెందినట్లు గుర్తించాడు. విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్లు బాధితుడు తెలిపాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు.