నిజామాబాద్ : అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూ తగాదా ఒకరిని బలిగొంది. తమ్ముడు కర్రతో దాడి చేయగా.. అన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని ఎడపల్లి మండలంలోని అంబం(వై) గ్రామంలో చోటుచేసుకున్నది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అంబం(వై) గ్రామానికి చెందిన హన్మాండ్లుకు ఇద్దరు భార్యలు. వారిలో ఒక కుమారుడు జుట్టు శ్రీను (35), మరో భార్య కుమారుడు నరేందర్ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు.
ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి జుట్టు శ్రీను ఈ నెల 4వ తేదీన స్వగ్రామానికి వచ్చాడు. కొన్నేండ్లుగా వ్యవసాయ భూమి విషయంలో తమ్ముడు నరేందర్తో శ్రీనుకు గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన రాత్రి ఇంటికి వచ్చిన తమ్ముడు నరేందర్తో శ్రీను గొడవకు దిగి కర్రతో దాడి చేశాడు.
అడ్డు వచ్చిన తండ్రిపై కూడా కర్రతో దాడి చేయగా ఆయనకు గాయాలయ్యాయి. తనకు ప్రాణాపాయం ఉన్నదని భావించిన నరేందర్ తన సోదరుడు శ్రీను చేతిలో నుంచి కర్రను లాక్కొని గట్టిగా తలపై దాడి చేశాడు. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న బోధన్ రూరల్ సీఐ బి. రవీందర్నాయక్, ఎడపల్లి ఎస్సై డి. ఎల్లా గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: ఎమ్మెల్సీ కవిత
కరోనాని ధైర్యంగా ఎదుర్కొందాం : మంత్రి ఎర్రబెల్లి
పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది