కొత్తూరు : కారును డీసీఎం ఢీకొట్టిన ఘటనలో డీసీఎం డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన కొత్తూరు బైపాస్ పెంజర్ల రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్లున్న ఎర్టీగా వాహనం కొత్తూరు బైపాస్ పెంజర్ల రోడ్డు వద్దకు రాగానే సడన్గా బ్రేకు వేసి కొత్తూరు వైపు తిప్పాడు. దీంతో షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం ఎర్టీగాను ఢీకొట్టింది. డీసీఎం డ్రైవర్ తిరుపతిరెడ్డికి స్పల్ప గాయాలు అయ్యాయి.
ఈ సందర్భంగా సీఐ భూపాల్శ్రీధర్ మాట్లాడుతూ ఎర్టీగా వాహనం డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలిపారు. వేగంగా వెళ్తూ అకస్మాత్తుగా కొత్తూరు వైపు తిప్పడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఎర్టీగాలో ఇద్దరు ఉన్నారని ఎవరికీ గాయాలు కాలేదన్నారు. అయితే డీసీఎంలో సిమెంటు ఇటుకలు ఉండటంతో అవి ఎర్టీగాపై పడటంతో వాహనం పూర్తిగా దెబ్బతిన్నదని స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.