Online Stock Trading Scam : సైబర్ నేరగాళ్లు రోజుకో తరహా స్కామ్తో ఆన్లైన్ వేదికగా అమాయకులకు వల విసిరి నిండా ముంచేస్తున్నారు. తాజాగా కోల్కతాకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్లో నిందితులు ఏకంగా రూ. 20 లక్షలు దోచేశారు. కోల్కతాలోని బెలియఘటలో నివసించే 58 ఏండ్ల ప్రదీప్ సర్కార్ను స్టాక్ మార్కెట్లో లాభాల ఆశ చూపిన స్కామర్లు లూటీ చేశారు. ప్రదీప్ సర్కార్తో పాటు ఆయన 27 ఏండ్ల కుమారుడు ఇద్దరూ క్యాన్సర్ రోగులు కావడంతో తమ ట్రీట్మెంట్ ఖర్చులు, భవిష్యత్ ప్రణాళికల కోసం దాచుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు.
సీఎస్టీసీలో పనిచేసే ప్రదీప్ సర్కార్ తన డీమాట్ అకౌంట్ ద్వారా షేర్లలో పెట్టుబడులు పెడుతుంటాడు. ఆయన షేర్లు మంచి లాభాలను కూడా అందించాయి. అయితే వైద్య ఖర్చులు, ఇతర ఖర్చుల కోసం ఆయన స్టాక్ మార్కెట్లో మరిన్ని లాభాల కోసం అన్వేషిస్తుండగా ఫేస్బుక్లో ఫ్రీ ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ కోర్సు లింక్ చూసి దానిపై క్లిక్ చేశాడు. ఆపై కోర్సులో చేరడంతో నిర్వాహకులు అతడిని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. వాట్సాప్ గ్రూప్లో నిర్వాహకులు స్టాక్ మార్కెట్ టిప్స్, సిఫార్సులు షేర్ చేశారు.
ఆపై స్కామర్లు సభ్యులను ఆరు టెలిగ్రాం గ్రూపులుగా విభజించి వారితో జోక్సా అనే ట్రేడింగ్ ప్లాట్ఫాంపై ఇన్వెస్ట్ చేయించారు. ప్రదీప్ సర్కార్ సైతం తన ఇన్సూరెన్స్ పాలసీలు, ఇతర షేర్లను విక్రయించి వచ్చిన మొత్తం జోక్సా ద్వారా ఇన్వెస్ట్ చేశారు. అమెరికన్ షేర్లలో తన పెట్టుబడి ఇన్వెస్ట్ చేసినట్టు తన పెట్టుబడులు రూ. కోటికి చేరాయని జోక్సా ఖాతా చూపడంతో ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేశాడు. ఆపై మనీ విత్డ్రా చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మోసపోయానని గ్రహించిన ప్రదీప్ సర్కార్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ స్కామ్ వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :