కొడంగల్ : అనారోగ్యం అందులో ఆర్థిక పరిస్థితులు తోడై మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని హస్నాబాద్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్, గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాయికోటి వెంకటయ్య(48) కొడంగల్ పట్టణంలో ని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
కరోనా నేపథ్యంలో ఏర్పడిన లాక్డౌన్తో పాఠశాలలు మూతపడి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గురువారం అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఉత్తరం రాసి పొలం వద్ద ఉరివేసుకున్నాడు. మృతుడి అన్నకూతురు అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.