కొడంగల్ : భూ తగాదాల్లో ఘర్షణకు గొడ్డెళ్లతో దాడికి పాల్పడిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ అప్పయ్య తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అప్పాయిపల్లి గ్రామంలో రెండు పొలాల మధ్య ఉన్న ఒడ్డు గొడవ చినికి చినికి గాలివానై ఇద్దరు వ్యక్తులు గొడ్డలతో దాడికి దిగడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ నిందితులను విచారించిన అనంతరం రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన అగ్గనూర్ వెంకటయ్య, తమ్ముళ్లు శ్రీశైలం, శ్రీనివాస్కు అదే గ్రామానికి చెందిన నవీన్, శివకుమార్, కాశప్ప, నర్సప్ప కుటుంబాలకు కొంత కాలంగా పొలం తగదాలు తలెత్తుతున్నాయి. తగదాకు సంబంధించి గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ చేపట్టుకున్నప్పటికీ రాజీ కుదరలేదు.
ఈ క్రమంలో సోమవారం అగ్గనూర్ వెంకటయ్య, తమ్ముళ్లు శ్రీశైలం, శ్రీనివాస్తో కలిసి తమ పొలానికి వెళ్లారు. పథకం ప్రకారం.. దారికాచి నవీన్, కాశప్ప, నర్సింహులు మా పొలం నుంచి వెళ్ల కూడదని గొడవకు పాల్పడి గొడ్డెలితో దాడికి దిగారు. దీంతో శ్రీను, శ్రీశైలంలకు గాయాలయ్యాయి. బాధితులు అగ్గనూరు వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దాడికి పాల్పడ్డ నింధితులు పరారీలో ఉండటంతో సోమవారం ఎస్ఐ సామ్యానాయక్, ప్రశాంత్వర్ధన్లు ఆచూకీ కనుక్కొని నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొని రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు.
సివిల్ కేసులకు సంబంధించి రాజీ కుదుర్చుకోవడం లేదా కోర్టు ద్వారా సమస్యలను పరిష్కరించునే చర్యలు చేపట్టుకోవాలని కానీ గొడవలు చేసుకొని విచక్షణ రహితంగా ప్రవర్తించరాదని పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన వారు ఎవరైనా సరే చట్టాపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.