తిరువనంతపురం: భార్యతో యువకుడికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన ఆమె భర్త అతడ్ని హత్య చేశాడు. కేరళలోని కొచ్చిలో ఈ సంఘటన జరిగింది. నెట్టూరు ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల సురేష్ కుమార్ భార్య ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నది. పాలక్కాడ్లోని పిరాయిరికి చెందిన 25 ఏళ్ల అజయ్ కుమార్, పాలక్కాడ్లోని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే అజయ్కు, సురేష్ భార్యకు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆమె అతడ్ని డబ్బులు అడిగింది. దీంతో ఈ నెల 27న అజయ్ కొచ్చి వచ్చాడు. సురేష్ భార్యను కలిసి డబ్బులు ఇచ్చాడు.
అయితే అజయ్ బస చేసిన హోటల్కు భార్య వెళ్లడం గురించి సురేష్కు తెలిసింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఆ రాత్రికి భార్య ఉంటున్న హాస్టల్కు సురేష్ వెళ్లాడు. ఆమెను కారులో ఎక్కించుకుని అజయ్ బస చేసి హోటల్కు వచ్చాడు. భార్యను కారులో ఉంచి అజయ్ గదికి వెళ్లాడు. వారిద్దరి సంబంధంపై అతడితో ఘర్షణకు దిగాడు. అజయ్ను కొట్టాడు. దీంతో భయపడిన అతడు ఆ హాటల్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే సురేష్ అడ్డుకుని కత్తితో పలుమార్లు పొడిచాడు. దీంతో అజయ్ అచేతనంగా పడిపోయాడు.
మరోవైపు హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు వచ్చారు. రక్తం మడుగుల్లో పడి ఉన్న అజయ్ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అజయ్ను హత్య చేసిన సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.