ముంబై: బంగారునగల షాపులో దోపిడీకి ప్రయత్నించిన ముగ్గురు నగల వ్యాపారిని తుపాకీతో కాల్చివేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం ఈ ఘటన జరిగింది. బైక్పై వచ్చిన ముగ్గురు దహిసార్ ప్రాంతంలోని జ్యువెలరీ షాపులో దోపిడీకి యత్నించారు. అడ్డుకోబోయిన నగల వ్యాపారిపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఈ ఘటన జరిగిందని, సీసీటీవీ రికార్డు ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని డీసీపీ డీఎస్ స్వామి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.