అమరావతి : విశాఖ జిల్లా జీకే వీధి మండలం బూదరాళ్ల ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పెదవలస నుంచి కొయ్యూరు రహదారిలో జీపు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరి కొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గాయపడ్డ వారిని చికిత్సకోసం ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.