చాంద్రాయణగుట్ట : జేసీబీ చోరీ అయిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడు సయ్యద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 1న బండ్లగూడ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో రోజు మాదిరిగానే సయ్యద్ అలీ తన జేసీబీ టీఎస్11ఈఎం8127 పార్కు చేసి ఇంటికి వెళ్లి నిద్రపోయాడు.
మరుసటి రోజు వచ్చి చూస్తే పార్కింగ్ స్థలంలో జేసీబీ కనిపించలేదు.చూట్టుపక్కల బస్తీల్లో వెతికినా ఆచూకీ తెలియపోవడంతో ఈ నెల 2వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై పోలీసులను ఆరా తీయగా జేసీబీ చోరీ అయినమాట నిజమేనని వెల్లడించారు.
సీసీ పుటేజీలో ఓ వ్యక్తి జేసీపీని చోరీ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయని, త్వరలోనే జేసీబీ ఆచూకీ తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.