మంచిర్యాల : గుట్కా అక్రమ నిల్వలపై మంచిర్యాల జిల్లా జన్నారం జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ను పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా రామగుండం సీపీ సత్యనారాయణ వివరాలను వెల్లడించారు. నిందితులు జన్నారం కేంద్రంగా గుట్కా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గుట్కా, నల్లబెల్లం, పటిక, నకిలీ పత్తి విత్తనాలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా ఇసుక అక్రమంగా తరలిస్తున్న నిందితులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వివిధ కేసుల్లో మొత్తం 8 మంది నిందితులు అరెస్టు అయినట్లు చెప్పారు. 8,840 కిలోల నల్లబెల్లం, 6,680 కిలోల పటిక స్వాధీనం చేసుకోవడంతో పాటు రూ.2.10 లక్షల విలువైన గుట్కా, నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేసినట్లు సీపీ పేర్కొన్నారు.