శ్రీనగర్ : లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ ఆరోపణలపై పిర్యాదు ఆధారంగా బీజేపీ నేత మహ్మద్ సిద్ధిక్ ఖాన్, ఆయన అనుచరుడు షాహిద్ అహ్మద్ భట్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్లో స్ధానిక కోర్టు కొకెర్నాగ్ పోలీసులను ఆదేశించింది.
తమపై లైంగిక వేధింపులకు పాల్పడి బ్లాక్మెయిల్ చేశారని ఆరోపిస్తూ తల్లీ కూతుళ్లు నిందితులపై చర్యలు చేపట్టాలని కోరుతూ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ను ఆశ్రయించారు. ఫిర్యాదిదారులు లేవనెత్తిన నేరాల తీవ్రత ఆధారంగా ఈ కేసును సరైన రీతిలో దర్యాప్తు చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోర్టు అభిప్రాయపడింది. ఆపై బాధితుల ఫిర్యాదు కాపీని, కోర్టు ఉత్తర్వులను కొకెర్నాగ్ పోలీస్ స్టేషన్కు పంపారు.
కోర్టు ఆదేశాలతో నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు నిందితులు మహ్మాద్ సిద్ధిక్ ఖాన్, ఆయన అనుచరుడు షాహిద్ అహ్మద్లను అరెస్ట్ చేశారు. నిందితులు సమాజంలో పలుకుబడి కలిగిన వారని..ఆధారాలను, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని ఫిర్యాదుదారులు ఆందోళన చెందుతున్న క్రమంలో బాధితులకు న్యాయం చేసేలా దర్యాప్తు సాగాలని ఉత్తర్వుల్లో న్యాయస్ధానం స్పష్టం చేసింది.