Digital Arrest Scam : సైబర్ నేరగాళ్లు రోజుకో తరహా స్కామ్తో స్వైర విహారం చేస్తున్నారు. ఆన్లైన్ అడ్డాగా అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఇక లేటెస్ట్ స్కామ్లో సైబర్ నేరగాళ్లు నోయిడాకు చెందిన ఓ ఐటీ ఇంజనీర్ను ఆన్లైన్లో పోలీస్ అధికారులమని బెదిరిస్తూ డిజిటల్ అరెస్ట్ సాకుగా చూపుతూ రూ. 3.75 లక్షలు దోచేశారు. మీ పేరుతో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన పార్సిల్ వచ్చిందని బెదిరిస్తూ అమాయకుల నుంచి స్కామర్లు రూ. లక్షలు గుంజుతున్నారు.
ఈ క్రమంలో నోయిడాకు చెందిన మహిళా టెకీని నిందితులు గత నెల 28న టార్గెట్ చేశారు. నోయిడాలోనిసెక్టార్ 45లోని అమ్రపాలి సఫైర్కు చెందిన మహిళా టెకీ స్కామర్ల చేతిలో మోసపోయారు. మహిళ చిరునామాతో డ్రగ్స్తో కూడిన పార్సిల్ వచ్చిందని, ఎయిర్పోర్ట్లో అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారని కొరియర్ కంపెనీ ప్రతినిధి ఫోన్ కాల్లో ఆమెకు వివరించారు. కేసు వివరాలు తెలుసుకునేందుకు స్కైప్ కాల్లో జాయిన్ కావాలని కాలర్ సూచించారు.
ఆపై వీడియో కాల్లో మహిళను బెదిరించిన నిందితులు ఏడు గంటల పాటు స్క్రీన్ ముందు కూర్చోపెట్టారు. ఈ కేసు నుంచి మహిళ పేరును తొలగించేందుకు స్కామర్లు ఆమెను డబ్బు డిమాండ్ చేశారు. లేకుంటే డిజిటల్ అరెస్ట్ తప్పదని బ్లాక్ మయిల్కు దిగారు. ఆపై ఆమె నుంచి కీలక బ్యాంక్ వివరాలు రాబట్టిన అనంతరం బాధితురాలి బ్యాంక్ ఖాతా నుంచి స్కామర్లు రూ. 3.7 లక్షలు తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. మోసపోయానని గ్రహించిన మహిళా టెకీ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :