మర్పల్లి : మండలంలోని తిమ్మాపూర్ వాగులో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రవహించిన వాగులో ఓ పెండ్లి కుటుంబం కారు కొట్టుకుపోగా నవాజ్రెడ్డి, అతడి అక్క రాధమ్మ ప్రాణాలతో బయట పడ్డారు. సోమవారం కారు డ్రైవర్ రాఘవేందర్రెడ్డి క్షేమంగా బయట పడగా పోలీస్ శాఖ, రెవున్యూ అధికారులు గాలింపు చేయగా ప్రవళిక, శ్వేత మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతురాలు శ్వేత కుమారుడు ఇషాంత్రెడ్డి (8) కనిపించకపోగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఆదేశాల మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. ఎట్టాకేలకు బుధవారం తల్లి శ్వేత మృతదేహానికి రెండు వందల మీటర్ల దూరంలో ఇషాంత్రెడ్డి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.