లక్నో : యూపీలో దారుణ ఉదంతం వెలుగుచూసింది. యూపీ రాజధాని లక్నో గోమతినగర్లో బ్రిడ్జిపై నుంచి మహిళ నదిలోకి దూకి బలవన్మరణానికి యత్నించింది. సోదరితో కలిసి ఘటనా స్ధలానికి చేరుకున్న మహిళ ఆపై తన మొబైల్ ఫోన్ను సోదరికి అప్పగించి నదిలోకి దూకింది.
సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్ధలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఆరు గంటల పాటు గాలించినా మహిళ మృతదేహం నదిలో లభించలేదు. మహిళ ఎందుకు అంత తీవ్ర నిర్ణయం తీసుకుందనేది కూడా వెల్లడికాలేదు. మహిళ మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.